జగన్‌కు వచ్చే ఓట్లు చీల్చాలి.. టీడీపీకి వచ్చే ఓట్లు పక్కాగా పడేలా చూడాలి.. ఇదీ ఇప్పుడు చంద్రబాబు అనుసరిస్తున్న ద్విముఖ వ్యూహం.. జగన్ ఓట్లు చీల్చేందుకు ఉన్న మార్గాలు మూడు.. ఒకటి పవన్ కల్యాణ్.. రెండు కే ఏ పాల్.. మూడు కాంగ్రెస్.. 


పవన్ కల్యాణ్ ను వీరుడు శూరుడు అంటూ ప్రొజెక్టు చేయడం ద్వారా.. లోపాయకారీ ఒప్పందాల ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ను.. అంటే జగన్ కు వడే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాలి. రెండోది కే ఏ పాల్.. కేఏ పాల్ ద్వారా  రెండు  లభాలు టీడీపీకి ఉన్నాయి. 

ఒకటి.. జగన్ వైపు పడే దళిత, క్రిస్టియన్ల ఓట్లను పాల్ ద్వారా చీల్చడం.. రెండోది ఆయన హెలికాప్టర్ గుర్తు ద్వారా ఫ్యాన్‌ కు ఓటేసే వారిని కన్‌వ్యూజ్ చేసి కొంత వరకూ జగన్ కు పడే ఓట్లు పడకుండా చేయడం.. ఇక మూడోది కాంగ్రెస్.. రాష్ట్రంలో అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్‌ బలోపేతమైందంటూ ప్రొజెక్టు చేయడం ద్వారా జగన్ కు పడే ఓట్లు చీల్చడం.

ఇవీ టీడీపీ ఆలోచనలు.. ఎలాగూ తమకు పడే పించన్ల ఓట్లు, పసుపు కుంకమ ఓట్లు ఎలాగూ టీడీపీకే పడతాయని వారి అంచనా. అయితే ఇవన్నీ లెక్కల్లో బాగానే వుంటాయి. కానీ జనంలో ఓ వేవ్ ఉన్నప్పుడు ఇవేమీ పని చేయకపోవచ్చు.. మరి ఏంజరుగుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: