ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో ఉండే నగిరి నియోజకవర్గం చాలా ప్రాధాన్యతను సంతరించుకుని ఉంది. ఇక్కడ ఈ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలు అయిన టీడీపీ మరియు వైసీపీ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఎప్పటినుండో నగిరి లో కాంగ్రెస్ ప్రభుత్వం తమ హవా చూపుతూ ఉండేది. ఒక్క రెడ్డి వారి చెంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున 5 సార్లు నగిరి నియోజకవర్గం లో విజయదుందుభి మోగించారు. మధ్యలో ఒక రెండు సార్లు లు తెదేపా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించినా, క్రితం సారి రోజా 858 ఓట్ల అతి స్వల్ప మెజారిటీ తో గట్టెక్కింది.

అయితే ఈ సారి, తెదేపాలో కుటుంబ వర్గపు పోరు కొంచెం కలవరపెడుతోంది అనే చెప్పాలి. క్రితం సారి గాలి ముద్దకృష్ణమనాయుడు రోజా సెల్వమనికి గట్టి పోటీ ఇచ్చినా, ఈ సారి అతని పెద్ద కొడుకు గాలి భాను ప్రకాశ్ సీటు కావాలని పట్టుపట్టి కూర్చున్నాడు. చివరికి ఎన్నో తర్జన భర్జనల తరువాత అధిష్టానం గాలి భాను ప్రకాశ్ కే సీటు కేటాయించింది. మళ్లీ ఉత్కంఠ పోరుకు దారి తీసేలా ఇక్కడ కనిపిస్తున్నా... రోజా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అంత దూరం తనని వెళ్లనివ్వవు అని ఇక్కడి ప్రజల మాట. ఆంధ్ర – తమిళనాడు సరిహద్దు ప్రాంతంగా ఉండే నగిరీలో దాదాపు రెండు భాషలు వచ్చిన వారి సంఖ్య అధికం. టీ.వీ షో ల ద్వారా రోజాకి వచ్చిన ఆదరణ కూడా ఆమెకు ప్లస్ కావచ్చు.

మరో  వైపు గాలి భాను ప్రకాశ్  కూడా ఎంతో పక్కా ప్రణాళికతో ముందుకు దూసుకుపోతున్నాడు. అతనిని తక్కువ అంచనా వేయడానికి అస్సలు వీలు లేదు. ఇక జనసేన పార్టీ తమ మిత్ర పక్షం అయిన బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థికి ఈ టికెట్టు కేటాయించింది. వారి తరుపు నుండి నాగబోయిన ప్రవల్లిక యాదవ్ బరిలో ఉంది. స్వల్ప మెజారిటీతో రోజా పోయినసారి గట్టెక్కింది కాబట్టి ఈ సారి జనసేన కి వచ్చే ఓట్లు కీలకం కానున్నాయి. కాబట్టి పోరు హోరాహోరీ అయినా వైసీపీ మాత్రం ఈ నియోజకవర్గంలో ముందంజలో ఉందనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: