తాడిపత్రి అనంతపురం జిల్లాలో అనంతపురం టౌన్ తరువాత రెండో అతిపెద్ద నియోజకవర్గం. ఇక్కడ ఈ ఊరు పేరు చెప్పగానే గుర్తొచ్చేది మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పేరు. ముందు కాంగ్రెస్ లో ఉండి రాజ్యమేలిన ఈయన 2014 లో టీడీపీలో చేరారు. వీళ్ళ పట్టు ఎలా ఉందంటే వరుసగా ఆరు సార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా జెసి దివాకర్ రెడ్డి  గెలుపొందారు. ఇకపోతే వైయస్సార్సీపి  పార్టీ నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి  పోటీ చేయనున్నారు.

ఇంతటి గట్టి పోటీ మధ్య కేతిరెడ్డి తన సత్తా చాటుకుని  గెలవాలని తన వంతుగా కృషి చేస్తున్నారు. ఈ సారి మాత్రం జేసీ తన కొడుకు జేసీ అస్మిత్ రెడ్డిని బరిలోకి దింపారు. పైగా ఈ మధ్య ప్రచార సమయంలో భాగంగా త్రాగునీరు సరిగ్గా అందలేదు అని ప్రశ్నించిన అతని పై జేసీ విప్పిన తిట్ల పురాణం కూడా ఆయన పైన ప్రతికూల ప్రభావం భారీగా పడింది. 30 ఏళ్లుగా అధికారంలో ఉన్న జేసీ కుటుంబం తాడిపత్రి లో కనీస అభివృద్ధి కూడా   చేయలేదన్న అపవాదనలు వినిపిస్తూ ఉంటాయి.

ఇక  తాగు నీరు సరిగా అందుబాటులో లేక ప్రధాన సమస్యగా మారింది. దీంతో ప్రజలు కొత్త నాయకుడిని ఎన్నుకునే ఆలోచనలో ఉన్నారని అర్థం అవుతుంది. దీంతో కేతిరెడ్డి  గెలుపు అవకాశాలు  మెండుగా ఉన్నట్లు  కనిపిస్తుంది .ఇదే అదనుగా వైఎస్ఆర్సిపి  దూకుడు పెంచి గెలుపొందాలని గట్టి కసితో వ్యూహాలు రచిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: