తెలుగు రాహ్ట్రాల్లో “కుల మీడియా “ అనే ఒక ఉన్మాధం సృష్టికర్త స్వతహాగా కులోన్మాది తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ ంఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనని ప్రతిపక్ష వైసిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి విమర్శించారు. “ఎల్లో మీడియా” అనే పేరుతో తెలుగు మీడియా విభాగం కులప్రాతిపధికపై ఏర్పడి ఆయనను ప్రతిరోజూ ప్రస్తుతిస్తూ ఆకాశానికి ఎత్తేస్తూ, విపక్షం వైసీపీపై అభూత కల్పనలతో దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. 
టిడిపి అధినేత చంద్రబాబు, కుల జ్యోతి ఆంధ్ర జ్యోతి ప్రధాన సంపాదకులు వేమూరి రాధాకృష్ణ సంభాషణ వారి దుర్మార్గానికి పరాకాష్ట అన్నారు.


సోమవారం హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌ లోని వైసిపి కార్యాలయంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, దశాబ్ధాల పాటు చంద్రబాబును ఆంధ్రజ్యోతి, మిగతా ఇతర కుల మీడియా వర్గాలు ఆకాశానికి ఎత్తేస్తూ దేశం లోనే అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా ప్రచారం చేస్తున్నాయని, అదే సమయంలో వైసీపి  ప్రజల్లోకి చొచ్చుకు పోతుంటే, దుష్ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. 
abn radha & CBN కోసం చిత్ర ఫలితం
‘కొంత కాలం క్రితం వరకు రాధాకృష్ణ ఒక లాంబ్రెట్టా డొక్కు స్కూటర్‌ లో సాధారణమైన న్యూస్‌ కలెక్టర్‌గా ఉండే వారు” అని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ఈ రోజు అదే రాధాకృష్ణ ఆస్తి ₹50 వేల కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు. రాధాకృష్ణ పెద్ద మోసగాడని విజయసాయిరెడ్డి అన్నారు. 2010–2011 వ సంవత్సరంలో ఉమ్మడి హైకోర్టులో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు వ్యతిరేకంగా ఒక కేసు నమోదు అయిందని గుర్తు చేశారు. 


విజయ ఎలక్ట్రానిక్స్, నూజివీడు సీడ్స్, బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మిత్రులు అమోదా పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టారన్నారు. వారు పెట్టిన పెట్టుబడులను తిరిగి చెల్లించకుండా రాధాకృష్ణ ఎగ్గొట్టారన్నారు. కంపెనీ రికార్డుల్లో వారి పేర్లు లేకుండా మోసం చేశాడని తెలిపారు. ఈ అక్రమాల చరిత్ర దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. తాను మాట్లాడినట్లుగా ఒక ఆడియో సృష్టించారని, అది నా వాయిస్సే కాదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆ వాయిస్‌ ను “సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌” కు పంపించామని రాధాకృష్ణ చెబు తున్నారని, అలా పంపే అధికారం కేవలం పోలీసులకు మాత్రమే ఉందన్నారు. 
abn radha & CBN కోసం చిత్ర ఫలితం
రాధాకృష్ణ అక్రమాలు, అవినీతిని వ్యతిరేకిస్తోన్నతమపై ఆయన యుద్ధం ప్రకటించారని, దానిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు వైసిపికి ఉన్నాయని తెలిపారు. యుద్ధంలో పోరాటం చేయడమే వైసిపికి తెలుసని విజయసాయిరెడ్డి వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికార దుర్వినియోగంపై తాను చేసిన ఫిర్యాదుల్లో కేవలం10 శాతం ఫిర్యాదులపై మాత్రమే ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుందని విజయసాయిరెడ్డి చెప్పారు. 


ఏపీ డీజీపీ, ప్రకాశం, చిత్తూరు జిల్లాల ఎస్‌పీ లను మార్చమన్నా మార్చలేదని, కేఏ పాల్‌ పార్టీ గుర్తును మార్చమన్నా పట్టించుకోలేదని పేర్కొన్నారు. తప్పుడు వార్తలు సృష్టిస్తోన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై డీజీపీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఒక అవగాహనతో పోటీ చేస్తున్నారని వి. విజయసాయిరెడ్డి తెలిపారు.
abn radha & CBN కోసం చిత్ర ఫలితం
ఎన్టీఆర్‌కు స్వయానా అల్లుడైన చంద్రబాబుకు, ఎన్టీఆర్‌ పట్ల ఎలాంటి గౌరవం ఉందో ఇప్పుడు వైరల్‌ అవుతున్న వీడియో చూస్తే ప్రజలకు అర్థమౌతుందన్నారు. ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ నుంచి "వాడి" పేరును (ఎన్టీఆర్‌)  తొలగిస్తానని చంద్రబాబు - రాధాకృష్ణతో అనడం స్పష్టంగా ఉందన్నారు. బుద్ధి, జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరైనా సొంత మామనే “వాడు, వీడు” అని పిలుస్తారా? వీడియోలో నమోదు అయిన రికార్డింగ్‌ ను పరిశీలిస్తే రాధాకృష్ణ, చంద్రబాబు ఎంత దుర్మార్గులో అర్థం అవుతుందని చెప్పారు. 


అత్యంత నీచులైన చంద్రబాబు, రాధాకృష్ణకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. రాజకీయరంగంలో చీడపురుగు చంద్రబాబు అయితే, జర్నలిజం విలువలను మంట గలిపిన వ్యక్తి రాధాకృష్ణ అని మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌, వాటి మానేజిగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ పై హైదరాబాద్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. వైసిపి వి.విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు సోమవారం రాధాకృష్ణ పై కేసు నమోదు చేశారు. 
abn radha & CBN కోసం చిత్ర ఫలితం
ఈ కేసులో మరికొందరు నిందితులుగా ఉన్నట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.  తనది కాని గొంతును తనకు ఆపాదిస్తూ తాను మాట్లాడినట్లు ప్రసారం చేసి తన ప్రతిష్టను, తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా వేమూరి రాధాకృష్ణ వ్యవహరించా రని, ఈ వ్యవహరం వెనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి పాత్రపై అనుమానాలు ఉన్నాయని విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఆదివారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు అందగా న్యాయ సలహా తీసుకున్న పోలీసులు సోమ వారం కేసు రిజిస్టర్‌ చేశారు. నిందితులకు నోటీసులు జారీ చేయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: