ఇప్పుడు మరో జాతీయ సర్వే ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సునామీని ఖాయం చేసేసింది. ఏపీ ఎన్నికల్లో జగన్ పార్టీ స్వీప్ చేస్తుందని సీఎన్‌ఎన్‌ న్యూస్ 18 వార్తాసంస్థ చేపట్టిన సర్వే తేల్చేసింది.  ఈ సర్వే ప్రకారం.. వైసీపీ 19 స్థానాలు గెలుచుకోబోతుందని, టీడీపీ కేవలం 6 స్థానాలకే పరిమితం కాబోతుందని సర్వే వెల్లడించింది. 


గత ఎన్నికల్లో 15 స్థానాలు గెలిచిన టీడీపీ ఈసారి 6 స్థానాలకే పరిమితం అవుతుందట. గత ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకున్న వైసీపీ.. ఈసారి ఏకంగా మరో 11 స్థానాలను తన ఖాతాలోకి వేసుకుంటుందట. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన జనసేన డక్ అవుట్ అవుతందట. 

రాష్ట్రంలో ఉనికి కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కూడా  ఖాతా తెరిచే ఛాన్స్ లేదట. సేమ్ పరిస్థితి బీజేపీది కూడా. ఇవే ఫలితాలను అసెంబ్లీ సీట్లకు కూడా ఆపాదించుకుంటే.. ఫ్యాన్ పార్టీ దాదాపు 130 అసెంబ్లీ స్థానాల వరకూ గెలిచే ఛాన్స్ ఉందన్నమాట. 

ఇక జాతీయ స్థాయి ఫలితాలు పరిశీలిస్తే. బీజేపీకి 263 సీట్లు, కాంగ్రెస్‌కు 139 సీట్లు, ఇతరులకు 141 సీట్లు వస్తాయట. గత ఎన్నికలతో పోల్చితే బీజేపీకి 76 సీట్లు తగ్గుతుండగా.. కాంగ్రెస్‌కు 56 సీట్లు పెరుగుతున్నాయి. ఏదేమైనా జగన్ ప్రభంజనం ఖాయమని న్యూస్ 18 సంస్థ చెబుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: