విజయవాడ ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేస్తున్న పొట్లూరి వర ప్రసాద్.. పీవీపీ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం జనం చుట్టూ తిరిగి ఎన్నికల్లో గెలుపు కోసం  హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తి చేయకపోతే.. ఆ నాయకులను గుండు గీసి గాడిదపై ఊరేగించాలని అన్నారు. 


ఓ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న పీపీవీ.. ప్రభుత్వం తీరుపై ఆవేశంగా మండిపడ్డారు. రాష్ట్ర రాజధాని నగరంగా పేర్కొన్న  విజయవాడలోని మురికివాడల్లో ఆయన పర్యిటంచారు. ఇంతవరకూ ఇలాంటి మురికి వాడలను ఏ నాయకుడూ సందర్శించలేదని అన్నారు. 

అమరావతి సింగపూర్ చేస్తామంటున్న నాయకులు.. సింగపూర్, మలేసియా వద్దు.. కనీస అవసరాలు తీర్చమని అడుగుతున్నారని..కానీ అవి ఇచ్చే పరిస్థితిలేని నేతలు.. డబ్బాలు కొట్టుకుంటున్నారని అన్నారు. నేను సవాల్ విసురుతున్నా.. ఏ నాయకుడైనా.. వచ్చి ఈ మురికి వాడల్లో మూడు నిద్దర్లు చేస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు. 

ముఖ్యమంత్రి మనవడు.. అక్కడ ఒక్క రోజు ఉండగలడా.. ఏం వాళ్లవి ప్రాణాలు కావా.. వాళ్లు మనుషులు కారా అంటూ ఆవేశపడ్డారు. అందుకే ఎన్నికల ముందు వచ్చి హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకపోతే.. ఆ నాయకులను గుండు గీసి గాడిదపై ఊరేగించాలని.. నాకైనా అదే పర్తిస్తుందని పీవీపీ అన్నారు. మరి రేపు పీవీపీ గెలిస్తే.. వైసీపీ అధికారంలోకి వస్తే.. వీరు బతుకులు మారిపోతాయా.. చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: