నారా చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాటు నరేంద్ర మోడీతో కలిసి ఉన్నారు. కెసిఆర్ తో అనేకసార్లు స్నేహం చేశారు. ఆ తర్వాత ఇంకా అనేక సార్లు పొత్తు కోసం ప్రయత్నించారు. అయితే ఇప్పుడు నోటికి వచ్చినట్లు ఇద్దర్నీ దూషిస్తున్నారు. వీళ్ళ స్నేహం ప్రజలకు తెలియదా? ప్రజలు పిచ్చివాళ్లనుకుంటున్నారా? చంద్రబాబు! ఇంకా నిరాశ నిస్పృహతో వివిధ సందర్భాల్లో ఆయన సభ్యత మరచి తోటి నాయకులపై వాడిన అసభ్య పదజాలం - దుర్భాషలు.

chandrababu in depression కోసం చిత్ర ఫలితం

  • "మోడీ జాగ్రత్తగా ఉండు. దేశం వదిలి పెట్టి పోవాల్సి వస్తుంది. నా మీదకు ఈడీ పంపిస్తావా? ఐటిని పంపిస్తావా? ఎవడిచ్చాడు నీకు అధికారం? ఎన్నికల సంఘం పూర్తిగా నిర్వీర్వం అయిపోయింది. ప్రతిపక్షాల మీదకు ఈడీ, ఐటిలను పంపిస్తారా? దేవేగౌడ, మమతా బెనర్జీ, మా మీదకే కేంద్ర సంస్థలను వదులుతారా? ఖబడ్డార్" అంటూ హెచ్చరించారు.
  • "జగన్, కెసీఆర్ లు మోడీ పెంపుడు కుక్కులు" అని విమర్శించారు. 
  • "జగన్ కు కెసీఆర్ ఓ బంగారు బిస్కెట్ విసిరేస్తే అది కొరుక్కుంటూ ఉన్నారు" అని ధ్వజమెత్తారు.
  • "జగన్ ప్రతి రోజూ లోటస్ పాండ్ కు వెళ్ళి - కెసీఆర్ నివాసానికి పోయి ఆయన కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటున్నారు" అని అంటూ, "అందుకు కేసీఆర్ ప్రతిగా జగన్ కు కుక్క బిస్కెట్లు వేస్తున్నారు" అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.  
  •  "పొరపాటున జగన్ కు ఓటు వేస్తే ఏపీకి నీళ్ళు రావు, రాష్ట్ర ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టుపెడతారు" అని "ఏపీలో ఓటర్లకు ప్రతిపక్షం పెద్ద ఎత్తున డబ్బులు పంచుతోంది ఈ డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి" అని ప్రశ్నించారు. 
  • "ఆంధ్రా వాళ్ళు అంటూ ఎన్నో తిట్లు తిట్టిన కెసీఆర్ పై మీకు కోపం లేదా?" అని ప్రశ్నించారు. 
  • "నాగార్జునసాగర్, శ్రీశైలంపై హక్కులు కావాలని కోరుతున్నారు" అని ధ్వజమెత్తారు. "నన్ను సన్యాసి అని తిడుతున్నారు కెసీఆర్. ఏపీలో ఆడబిడ్డలకు పెద్ద ఎత్తున పెన్షన్ ఇస్తున్న నేను సన్యాసినా?" అని ప్రశ్నించారు
  • "నన్ను సన్యాసి అంటే మీకు కోపం రావటం లేదా?" అని సభికులను ఉద్దేశించి ప్రశ్నించారు. గురజాల ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇవి కాకుండా రెగ్యులర్గా ఏపీ ప్రతిపక్షనేత జగన్మోహనరెడ్డిపై, చంద్రబాబు నాయుడు పలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇక జగన్, కెసీఆర్ లు మోడీ పెంపుడు కుక్కులు అని విమర్శించటం ఆయనలోని విఙ్జత ఎక్కడికి పోయింది? అంటూ జనం విస్తుపోతున్నారు.  

chandrababu in depression కోసం చిత్ర ఫలితం


ఇక ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? స్టాన్ ఫోర్ట్ లో చదివినంత మాత్రం సంస్కారం వస్తుందా? అది పెంపకంతో కదా! వస్తుందంటారు. 


చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ మీడియా ముందు అడ్డంగా దొరికిపోవటం అలవాటే కాని ఇప్పుడు బుక్కయ్యారు. ఎన్నికల ప్రచారంలో తీవ్ర స్థాయిలో అసభ్య అభ్యంతరకర విపరీత వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక  "నాకు ఇంక ఓపిక నశించింది. ప్రతిపక్షం ఉన్నదే ప్రభుత్వంపై బుదర చల్లడానికి. ప్రతిపక్షం బురదచల్లి పారిపోతే, వాటిని నేను తుడుచుకుంటూ కూర్చోవాలా? ఏం పనిలేదా నాకు?"

nara lokesh angry talk at mangalagiri కోసం చిత్ర ఫలితం

"అందుకే వాళ్లను తన్నమంటున్నాను కదా! పోలీసు సోదరులకు కూడా నేను చెబుతున్నా! తంతే వాళ్ళు మీ జోలికి రారు. ఆ నా కొడుకులను తన్నాలి. లేకపోతే ఆ నా కొడుకులు ఇక్కడకు వచ్చి పుకార్లు లేపుతారు. వారికి ఇంకే పని లేదా?" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు విన్న మంగళగిరి ప్రజలే అవాక్కు అయ్యారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మున్సిపాలిటీ పరిధి లోని బ్రహ్మానందపురంలో ఎన్నికల ప్రచారం  సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: