ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి నడిచింది. తెలంగాణలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీలు ఇవాళ ప్రమాణం స్వీకారం చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు శాసనమండలిలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేశారు.
తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీలుగా మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, రియాజ్ ఉల్ హసన్, యెగ్గే మల్లేశంలు ప్రమాణస్వీకారం చేశారు. మండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు హాజరయ్యారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ గా ప్రమాణస్వీకారం చేశారు.