ఓటేసి వచ్చాక చిరునవ్వులు చిందించిన బాబు ఆ తరువాత మాత్రమే పెడ బొబ్బలు పెట్టిన సంగతిని జగన్ గుర్తు చేశారు. తాను ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే అది సైకిల్ కి పడితే చూస్తూ వూరుకుంటానా అంటూ బాబు చేతగానితనాన్ని కూడా ఎద్దేవా చేశారు. మొత్తానికి మొత్తం ఓటర్లు ప్రశాంతంగా ఓటేసి వెళ్ళిపోతే ఒక్క చంద్రబాబు మాత్రమే అరచి గీ పెట్టారని, బాగా జరిగిన పోలింగ్ విషయంలో బాబు జనాని తప్పు తోవ పట్టించారని జగన్ అన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరుండి మరీ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడిచేయడమే కాకుండా దొంగకేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. స్పీకర్ కోడేల శివప్రసాద్ పోలింగ్ బూత్లోకి వెళ్లి తలుపు వేసుకున్నా పోలీసులు ఆయనపై ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. ఓడిపోతాననే భయంతో చంద్రబాబు నాయుడు ప్రజల తీర్పును అవహేళన చేస్తు మాట్లాడుతున్నారని ఆరోపించారు.మొత్తానికి నాలుగు రోజుల పాటు బాబు చేసిన హడావుడికి ఒక్క ప్రెస్ మీట్ తో జగన్ జబర్దస్త్ సమాధానమే చెప్పారనుకోవాలి.