మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచిన ఒకే ఒక్కడు రాజాసింగ్.. గోషా మహల్ నుంచి ఆయన  ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. దేశభక్తి, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం మెండుగా ఉండే రాజాసింగ్ తరచూ వివాదాల్లోనూ ఉంటుంటారు. తాజాగా ఆయన ఏకంగా పాకిస్తాన్ దేశంతో వివాదం పెట్టుకోవడం వార్తల్లో హల్ చల్ చేస్తోంది. 


ఇటీవల ఆయన హిందుస్తాన్ జిందాబాద్ అనే పాట విడుదల చేశాడు. అయితే ఈ పాటపై పాకిస్తాన్ సైన్యం అభ్యంతరం వ్యక్తం చేయడం విశేషం. ఎందుకంటే ఆ పాటన వాళ్ల సైన్యం గీతాన్ని అనుకరిస్తూ కాపీ కొట్టి రూపొందించిన పాట.. తాము విడుదల చేసిన సాంగ్‌ను చూసి కాపీ కొట్టారంటూ పాకిస్తాన్ ఆర్మీ రాజాసింగ్‌ పై ఆరోపణలు చేసింది. 

ఈ పాటను సహిర్ అలీ బగ్గా రాశారని... ఈ పాటను కాపీ కొట్టినందుకు సంతోషంగా ఉందని, కానీ అందుకు సంబంధించిన నిజాలు కూడా వెల్లడించాలని కదా అంటూ పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు. దీనికి రాజాసింగ్ పాడిన పాటను కూడా జత చేశారు.

ప్రస్తుతం రాజాసింగ్ పాట పాకిస్తాన్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఐతే.. ఇది రాజాసింగ్ కావాలని చేసిందే.. పాకిస్తాన్ సైన్యంతో గిల్లి కజ్జాలు పెట్టుకునైనా సరే భారత ఔన్నత్యాన్ని చెప్పలదలచుకున్నాడు రాజాసింగ్. ఆయన అనుసరించిన మార్గం అంత సరైంది కాకపోయినా.. ఆయన ఉద్దేశ్యం భారత్ గొప్పదనం చాటడమే. 



మరింత సమాచారం తెలుసుకోండి: