కన్నపిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కసాయిగా మారాడు.  తన పిల్లలను కర్కశంగా చంపాడు. తాజాగా ఈ ఘటన రామచంద్రాపురం బొంబాయి కాలనీలో జరిగింది.   భార్య విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లిపోవడంతో ఆగ్రహించిన ఓ భర్త తన ముగ్గురు పిల్లలను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్ సీ పురం దగ్గర ఉన్న కంజర్ల గ్రామానికి చెందిన కుమార్.. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురంలో ఈఎస్ ఐ ఆస్పత్రి పక్కన ఉన్న బాంబే కాలనీలో నివాసముంటున్నారు.


గత కొంత కాలంగా కుమార్ మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగి వచ్చి నిత్యం భార్యతో గొడవపడుతుంటాడు. భార్యాభర్తల మధ్య రోజూ గొడవ జరుగుతోంది...దాంతో విసుగెత్తిపోయిన భార్య ఇంటిని విడిచి పెట్టి వెళ్లింది. దీంతో పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చిన నిందితుడు నానమ్మ దగ్గర వున్న ముగ్గురు పిల్లలను ఇంటికి తీసుకొచ్చాడు. అనంతరం కుమారుడు అఖిల్(7), కుమార్తె శరణ్య(4)లను గొంతు కోసి హత్య చేశాడు.

ఆ తర్వాత పెద్ద కుమార్తె మల్లీశ్వరి(10) గొంతును కత్తితో కోసేందుకు ప్రయత్నించగా, బాలిక తప్పించుకుని నానమ్మ దగ్గరకు పారిపోయింది. మళ్లేశ్వరి (10) పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: