ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి మనుషుల్లో ఎన్నో మార్పులు చేర్పులు వస్తున్నాయి.  ఏదైనా వినూత్నమైన విషయం గురించి సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది.  ఒకప్పుడు ప్రింట్ మీడియాలో ఏదైనా విషయం చదవడానికి చాలా సమయం పట్టేది..కానీ సోషల్ మాద్యమాలు వచ్చినప్పటి నుంచి ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.  అయితే వివాహ పత్రికలు ఎన్నో రకాలుగా దర్శనమిస్తుంటాయి. 

ఎవరి స్థాయిని బట్టి వారు వివాహ ఆహ్వాన కార్డులు అచ్చు వేయిస్తుంటారు.  కాకపోతే ఈ మద్య తమ పెళ్లికార్డును ఎంత వెరైటీగా చేస్తే అంత బాగుంటుందని భావిస్తున్నారు.  తాజాగా  ఓటర్ ఐడీ కార్డు మాదిరిగా తయారైన ఓ శుభలేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.  ప్రస్తుతం దేశంలో ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో వెరైటీగా ఉండటమే కాదు ప్రజల్లో మంచి చైతన్యం తేవాలన్న ఆలోచనతోనే ఇలా ఎన్నికల గుర్తింపు కార్డులా శుభలేఖను ప్రచురించామని వధూవరులు చెబుతున్నారు. 


కర్ణాటకలోని ధార్వాడలో బెస్కాం అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న మంజునాథ్‌ కుమారుడు సునీల్‌ కు, హెస్కాంలో ఇంజనీర్‌ గా పని చేస్తున్న మహేశ్‌ అనే యువకుడి సోదరి అన్నపూర్ణలకు ఈనెల 26న వివాహం నిశ్చయించారు. పెళ్లికి వచ్చే బంధు మిత్రులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో, వీరు తమ శుభలేఖను వినూత్నంగా తీర్చిదిద్దారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: