జేడీ లక్ష్మీనారాయణ .. ఐపీఎస్ ఆఫీసర్ గా ఎన్నో పెద్ద పెద్ద కేసులను డీల్ చేశారు. అయితే జగన్ కేసుల ద్వారా బాగా ప్రాచుర్యం పొందారు. విశాఖ నుంచి లక్ష్మినారాయణ ఎంపీగా పోటీ చేశారు. మరి ఆయన గెలుస్తారా - ఓడతారా.. అనేది ఫలితాలు వస్తే కాని తెలియని అంశం.ఆ సంగతలా ఉంటే.. ఒక టీవీ చర్చా కార్యక్రమంలో లక్ష్మినారాయణ గురించి బీజేపీ నేత రఘురాం ఒక ఆసక్తిదాయకమైన వ్యాఖ్యను చేశారు.


గతంలో సీబీఐ  జేడీగా ఉన్నప్పుడు ఏపీకి సంబంధించి కీలకమైన కేసులను విచారించిన లక్ష్మినారాయణ.. విచారణ సందర్భంగా ఒక ఐఏఎస్ అధికారిపై చేయి చేసుకున్నారని రఘురాం అన్నారు.అలా లక్ష్మినారాయణ చేత భౌతిక దాడిని ఎదుర్కొన్న ఐఏఎస్ శ్రీలక్ష్మి  అని ఆయన చెప్పుకొచ్చారు. అప్పట్లో లక్ష్మినారాయణ వివిధ కేసుల్లో చాలా మంది ఐఏఎస్ ల మీద కేసులో నమోదు చేసిన సంగతి తెలిసిందే.


వారిలో కొందరు ఆ కేసులను కోర్టుల్లో కొట్టేయించుకుని తర్వాత విధుల్లో చేరిపోయారు. ఆ సందర్భంగా విచారణలో భాగంగా ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మిని లక్ష్మినారాయణ కొట్టారని రఘురాం చెప్పారు.విచారణలో భాగంగానే అయినప్పటికీ ఒక సాటి ఐఏఎస్ మీద లక్ష్మినారాయణ చేయి చేసుకుని ఉంటారా? అనేది మాత్రం బయటి వాళ్లకు తెలిసే అంశం కాదు. బీజేపీ నేత మాత్రం కొన్ని వర్గాల ద్వారా ఆ సమాచారం తెలిసిందని అన్నారు. మరి ఈ వ్యవహారంపై లక్ష్మినారాయణ స్పందిస్తారా? అయితే కొంత మంది మాత్రం ఇందులో ఏ మాత్రం నిజం లేదని జేడీ గురించి తెలిసిన వారు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: