ఎన్నికల పూర్తయినా ఇంకా కే ఏ పాల్ హడావిడి మాత్రం తగ్గలేదు.. ప్రజాశాంతి అనే ఓ పార్టీ ఉన్న ఆయన.. ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి.. స్వయంగా తానే ఓ చోట నామినేషన్‌ వేయలేని పరిస్థితి. ఓ చోట పోటీ చేసినా.. ఏ మాత్రం గెలవని పరిస్థితి. 


ఓటేసిన ఆనందంలో ఎగరడం.. బాక్సింగ్ ఫోజులివ్వండి.. ఇలా ఆయన ఓ కామెడీ పీస్ అయ్యారు. టీవీ ఛానళ్లు కూడా కామెడీ కోసం ఆయన్ను స్టూడియోకి పిలిపించుకుని ఆటలాడుకుంటున్నాయి. తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూకు వచ్చిన కేఏ పాల్.. తనదైన ధోరణిలో రెచ్చిపోయారు. 

"నేను చంద్రబాబు లాగా - జగన్ లాగా - కాంగ్రెస్ నేతల్లాగా లక్షల కోట్లు దోచుకోలేదు. నా సొంత సంపాదననే 37 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో డొనేట్ చేస్తున్నాను" అని పాల్ చెబుతున్న సమయంలో యాంకర్ అందుకుని మిమ్మల్ని ఈ రాష్ట్ర నాయకులు ఎందుకు సీరియస్ గా తీసుకోవడంలేదు? అని ప్రశ్నించారు. దాంతో పాల్ రెచ్చిపోయారు. 

నా ముందు బచ్చాలు వీళ్లందరూ.. చంద్రబాబునాయుడు ఈజ్ ఏ బచ్చా.. యస్ చంద్రబాబు ఈజ్ ఏ బచ్చా..  జగన్ ఓ క్రిమినల్. పవన్ కల్యాణ్ ను అయితే లెక్కలోకే తీసుకోను. వాట్ ఆర్ యూ టాకింగ్? నేనంతా నేషనల్ లీడర్స్ తోనే రాజకీయాలు చేస్తాను - కపిల్ సిబాల్ - అహ్మద్ పటేల్ పెద్దనాయకులా? మీరు చెబుతున్న చంద్రబాబు - జగన్ పెద్ద నాయకులా?" అంటూ యాంకర్ పై ఫైర్ అయ్యారు. 

దేశం  క్లిష్టపరిస్థితుల్లో ఉందనే ఈ ఇంటర్వ్యూకి  వచ్చాను అంటూ మొదలుపెట్టి అనేక అంశాలపై మాట్లాడారు. నేను ఒక్క నిమిషంలో కోటి రూపాయలు సంపాదించగలను - నా సమయం వృథా చేయొద్దని యాంకర్ పై మండిపడ్డారు. మొత్తానికి మరోసారి కే ఏ పాల్ టీవీ యాంకర్లతో ఆడుకున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: