ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును పదవి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తప్పించిన విషయం విదితమే.  తాజాగా ఎబీ వెంకటేశ్వర్ రావు కు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా ఏబీ వెంకటేశ్వరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జీవో జారీ చేశారు. 


గవర్నర్ ఉత్తర్వుల మేరకు జీవో నెంబర్‌ 882ను ఈ సందర్భంగా సీఎస్ విడుదల చేశారు. ఎన్నికలు పూర్తవ్వడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా గతంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న ఏబీని హెడ్ క్వార్టర్స్‌కు ఎన్నికల కమిషన్ అటాచ్ చేసింది. ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్ డీజీ బాధ్యతల నుంచి వెంకటేశ్వరరావును తొలగించాలని వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన్ను తొలగించారు.


 మార్చి 26న కేంద్ర ఎన్నికల సంఘం ఇంటెలిజెన్స్ డీజీగా బదిలీ చేయాలని ఆదేశించింది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కాగా, ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఇంటెలిజెన్స్ డీజీ బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: