తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల అంశం అందరినీ కదిలించింది. ఇంటర్ బోర్డు చేసిన తప్పులకు దాదాపు 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఎవరినైనా కదిలించకమానదు. ఈ అంశంపే ఏపీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు. 


ఒక విధంగా ఇది తెలంగాణ సర్కారు చేతకానితనాన్ని ఎత్తి చూపడమే. అయినా సమస్య తీవ్రమైంది కనుక.. తెలంగాణలోనూ తెలుగుదేశం ఉంది కనుక చంద్రబాబు ప్రకటనను ఏరకంగానూ తప్పుబట్టలేం. కానీ ఇక్కడే ఓ మెలిక ఉంది. 

తెలంగాణలోనూ తెలుగుదేశం పార్టీకి ఓ వ్యవస్థ అంటూ ఉంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎల్.రమణ.. ఆయన నేతత్వంలోని ఇతర కార్యవర్గం ఉంది. మరి ఇంటర్ విద్యార్థుల గోల ఇంత జరుగుతుంటే.. కనీసం ఒక్కరూ బయటకు వచ్చి స్పందించిన దాఖలాలు లేవు.

మరి దీన్ని బట్టి చూస్తే.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మూసేశారా అన్న అనుమానం కలుగుతోంది. చివరకు తెలంగాణ సమస్యలపై కూడా చంద్రబాబే స్పందిచాల్సి వచ్చిందేమో అన్న అనుమానం కలుగుతోంది. ఇలాగైతే తెలంగాణలో తెలుగుదేశం ఇంకెప్పుడు పుంజుకుంటుందో మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: