ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ఎన్డీ తివారి కుమారుడు రోహిత్ శేఖర్ హత్య  కేసు చిక్కుముడి వీడింది. అక్రమ సంబంధం కారణంగా రోహిత్ భార్య అపూర్వనే అతడిని చంపేసిందని పోలీసులు తేల్చారు. అపూర్వను అదుపులోకి తీసుకున్న పోలీసులు మూడు రోజుల పాటు విచారించి హత్య గుట్టు బయటపెట్టారు. 


ముందు పొంతనలేని సమాధానాలు చెప్పిన అపూర్వ.. పోలీసుల మార్కు విచారణతో అసలు వాస్తవాలు బయటపెట్టింది. రోహిత్ తో పెళ్లి తనకు సంతోషాన్ని ఇవ్వలేదని, తన కలలు, ఆశలు నెరవేరనందునే రోహిత్ ని చంపేశానని ఆమె ఒప్పుకుందట. 

హత్య చేసిన తర్వాత ఎలాంటి ఆధారాలు లేకుండా గంటన్నరలో అంతా ముగించేసిందని పోలీసులు చెబుతున్నారు. అయితే అపూర్వకు సంబంధించిన మరిన్ని వివరాలను రోహిత్ తల్లి ఉజ్వలాశర్మ మీడియాకు వెల్లడించారు. పెళ్లికి ముందే అపూర్వకు మరో వ్యక్తితో సంబంధం ఉందని చెప్పారు. 

అపూర్వ కుటుంబానికి డబ్బే ప్రధానమని.. వాళ్లు తమ ఆస్తిపై కన్నేశారని ఉజ్వలా శర్మ ఆరోపించారు. డిఫెన్స్ కాలనీలోని తమ ఆస్తిని కాజేయాలనుకున్నారని తెలిపారు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నా.. దాంపత్య జీవితం సంతోషంగా గడవలేదని చెప్పారు. తరచుగా గొడవపడేవారని ఆమె వివరించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: