బిగ్ బాస్ త్రీ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో అందులో ఎవరెవరికి చోటు దక్కుతుందనే అంశంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. బిగ్ బాస్ టూ సరిగ్గా సక్సస్ కాలేదన్న టాక్ బాగా ఉంది. ఆ లోటు భర్తీ చేసకునేందుకు ఈసారి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
పార్టిసిపెంట్స్ గా బాగా పేరున్న వారినే తీసకునే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే ఈ జాబితాపై అనేక ఊహాగానాలు ఉన్నాయి. అయితే వాటన్నింటిలోనూ బాగా వినిపిస్తున్న పేరు ఉదయభాను.. ఎందుకంటే ఈ ఉదయభాను జీవితంలో చాలా కాంట్రావర్సీలున్నాయి.
ఇలాంటి వారి వల్ల ప్రేక్షకుల్లో ఉత్సుకత పెరుగుతుందని రేటింగ్ బాగా వస్తాయని నిర్వాహకులు ఆలోచిస్తున్నారట. అందుకే కాస్త రేటు ఎక్కువైనా ఇలాంటి వారిని తీసుకోవాలని నిర్ణయించారట. ఉదయభాను పారితోషకం పై కూడా హాట్ కబుర్లు వినిపిస్తున్నాయి.
బిగ్ బాస్ షో ప్రారంభమైన నాటి నుంచి ఎలిమినేట్ అయ్యేవరకూ రోజులు రెండు లక్షల రూపాయలు ఇచ్చేందుకు కూడా సిద్దమయ్యారట. ఇదే నిజమైతే.. ఈ షోలో అత్యధిక పారితోషకం తీసుకునే పార్టిసిపెంట్ ఉదయభానుయే అవుతుంది.