న్యూ ఆంధ్రా సర్వే ఫలితాలు వెలువడ్డాయి. గుంటూరు జిల్లాలో ఈ ఫలితాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో తెలుగుదేశం విజయఢంకా మోగించింది. 


గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ 12 స్థానాలు గెలుచుకుంది. వైసీపీ కేవలం 5 స్థానాలతో సరిపెట్టుకోగా.. టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ ఖాతా తెరవలేదు. ఈ ఎన్నికల్లో న్యూ ఆంధ్రా సర్వే ప్రకారం ఈ జిల్లాలో టీడీపీ -వైసీపీ హోరాహోరీగా పోరు ఉంది. 

గుంటూరు జిల్లాలో హోరాహోరీ పోరులో వైసీపీదే పై చేయి అయ్యింది.  టీడీపీ  5 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందట. ఇక వైసీపీ 7 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తుందట.  జనసేన కూడా ఈ జిల్లాలో ఖాతా తెరుస్తుందట. ఒక స్థానం గెలుస్తుందట. 

మరో నాలుగు స్థానాల్లో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేనంత టఫ్ పైట్ ఉందని ఈ సర్వే వివరిస్తోంది. ఈ సర్వే ప్రకారం .. వైసీపీ 101 సీట్లు గెలుచుకుని అధికారం చేజిక్కించుకుంటోందట. అధికార తెలుగుదేశం పార్టీ టీడీపీ 48 స్థానాలు గెలుచుకుంటుందట. 

ఇక గట్టి పోటీ ఇస్తుందని కలవరపెట్టిన జనసేన ఆరు స్థానాలు మాత్రమే సాధిస్తుందట. మరో 20 స్థానాలు నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందని ఈ సర్వే చెబుతోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: