మరో కొత్త సర్వే వచ్చింది. ఎన్నికల ఫలితాల అంచనాపై ఉత్కంఠ పెరుగుతున్న వేళ న్యూ ఆంధ్రా సర్వే ఫలితాలు వెలువడ్డాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఈ ఫలితాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సీట్లు, విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 


గత ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం 7, వైసీపీ 3 స్థానాలు.. విజయనగరం జిల్లాలో టీడీపీ 6, వైసీపీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో న్యూ ఆంధ్రా సర్వే ప్రకారం.. ఈ రెండు జిల్లాల్లో టీడీపీ- వైసీపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. 

శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ- వైసీపీ చెరో ఐదు స్థానాలు గెలుచుకుంటాయని ఈ సర్వే చెబుతోంది. విజయనగరం జిల్లాలో వైసీపీ ఐదు స్థానాలు, టీడీపీ 3 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉందట. ఒక స్థానంలో హోరాహోరా సాగుతోందట. ఫలితం చెప్పలేకపోయారు.  

ఇక రాష్ట్రమంతా ఓవరాల్ గా చూస్తే ఈ సర్వే ప్రకారం .. వైసీపీ 101 సీట్లు గెలుచుకుని అధికారం చేజిక్కించుకుంటోందట. అధికార తెలుగుదేశం పార్టీ టీడీపీ 48 స్థానాలు గెలుచుకుంటుందట. ఇక గట్టి పోటీ ఇస్తుందని కలవరపెట్టిన జనసేన ఆరు స్థానాలు మాత్రమే సాధిస్తుందట. మరో 20 స్థానాలు నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందని ఈ సర్వే చెబుతోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: