వైఎస్ జగన్ మాట్లాడినా, మాట్లాడకపోయినా కూడా రెండూ డేంజరే. ఆయన హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఉన్నా, పాదయాత్రలో తిరిగినా కూడా త‌మ్ముళ్లకు బాధే. అసలు జగన్ ఉనికే  అలా వారిని భయపెడుతోంది. జగన్ ఇపుడు విహార యాత్రలకు స్విట్జర్లాండ్ కి వెళ్ళారు. అయితే జగన్ వేసవి విడిది పైనా కూడా తమ్ముళ్ళు నోరు పారేసుకుంటున్నారు. అనుమానాలు సందేహాలు ఎన్నో వ్యక్తం చేస్తున్నారు.


అదేంటి ఓ వైపు ఏపీలో ఎన్నికలు హోరా హోరీగా జరిగాయి. మరి జగన్ ఎందుకు అంత కూల్ గా ఉంటున్నాడు, ఇదీ ఇపుడు టీడీపీ నాయాకులకు పట్టుకున్న పెద్ద డౌట్. జగన్ వద్ద ఉన్న అంచనా ఏంటి. ఆయన ధీమాకు గల కారణాలు ఏంటి, ఇదే ఇపుడు పసుపు శిబిరాన్ని పిచ్చెక్కించేస్తోంది. జగన్ ఇంత నమ్మకంగా ఉంటారంటే తప్పకుండా అయన పార్టీ గెలుస్తుందేమో. ఇదో డౌట్ వచ్చేస్తోందిపుడు నిజానికి జగన్ పోలింగ్ తరువాత రోజు  నుంచి కూడా చాలా కూల్ గా ఉన్నారు. అది మెచ్యూర్డ్ పొలిటీషియన్ లక్షణంగా అంతా భావిస్తున్నారు.


హడావుడి ఎక్కడా చేయలేదు. సమీక్షలు అంటూ అంద‌రి బుర్రలు తినలేదు. తన వద్దకు వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించుకున్నారు. దాంతో హ్యాపీగా ఉన్నారంతే. ఈవీఎంలలో ఫలితం ఎటూ ఉంది. దాన్ని ఎవరూ మార్చలేరు. అందుకే జగన్ విహార యాత్ర పేరిట జాలీ చేస్తున్నారు. మరి టీడీపీలో మాత్రం ఫస్ట్రేషన్ పీక్స్ కి  వెళ్ళిపోతోంది. దానికి జగన్ కూల్ గా ఉండడం మరో పెద్ద కారణం అంటున్నారు. అంటే జగన్ అలా కూడా కిర్రెక్కించేస్తున్నాడా..


మరింత సమాచారం తెలుసుకోండి: