నిప్పుకు కూడా చెదలు పడతాయని సామెత. మరి నిప్పునని చెప్పుకునే చంద్రబాబుకు కూడా ఇబ్బందులు తప్పేట్లు లేవు. తాను నిజాయతీపరున్ని అని తనని ఎవరూ ఏమీ చేయలేకపోయారని చెప్పే చంద్రబాబుకు అచ్చమైన అగ్ని పరీక్ష ఇపుడు వచ్చింది. ఆయన ఎపుడూ అంటూంటారు, తాను క్లీన్ చీట్ తో ఉన్నానని, అయితే అదిపుడు రుజువు అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది.


పుష్కర కాలం క్రితం అన్న గారి రెండవ భార్య నందమూరి లక్ష్మీ పార్వతి చంద్రబాబు ఆస్తులపై ఏసీబీ కోర్టుకో కేసు వేశారు. అయితే ఆ వెంటనే బాబు హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన ఓ తీర్పు ప్రకారం దీర్ఘకాలంగా స్టేలల్లో ఉన్న కేసులు తిరగతోడమని పేర్కొంది. దాంతో పన్నెండేళ్ల నాటి బాబు కేసుకు ఒక్కసారిగా ప్రాణం వచ్చింది. ఈ కేసుని తాను వదలబోనని లక్ష్మీ పార్వతి అంటున్నారు. అప్పటికీ ఇప్పటికీ రాజ‌కీయంగా మార్పులు చాలా వచ్చాయి. 


జగన్ పార్టీలో ఆమె ఉన్నారు. ఒకవేళ వైసీపీ ఏపీలో అధికారంలోకి వస్తే లక్ష్మీ పార్వతికి ఎదురే ఉండదు. ఇక తెలంగాణాలో ఎటూ టీయారెస్ సర్కార్ ఉంది. ఇన్ని అనుకూలతలు లక్ష్మీ పార్వతికి ఉంటే బాబు ఓడిపోతే మాత్రం కష్టాలు ఒక్కోటీ చుట్టుముట్టినట్లే. ఈ కేసును బాబు ఎదుర్కొంటే మాత్రం ప్రతి శుక్రవారం కోర్టుకు రావాల్సివుంటుందేమోనని అంటున్నారు. గతంలో జగన్ని శుక్రవారం కోర్టు  అంటూ టీడీపీ తమ్ముళ్ళు వేళాకోళం ఆడేవారు. మరి ఇపుడు బాబు వంతు వచ్చిందా అంటున్నారు. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: