నేడు తెలుగు రాష్ట్రాల డీజీపీలు  తెలంగాణ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌‌లో భేటీ అయ్యారు.  కాగా,  ఈ సమావేశానికి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌లు హాజరయ్యారు.  భేటీ అనంతరం డీజీపీలు గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య పోలీస్‌ విభజన, సమస్యలపై చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం.


రాష్ట్ర విభజన అనంతరం నెలకొన్న సమస్యల పరిష్కారానికై ఇరు రాష్ట్రాల డీజీపీలు చర్చించారు. పోలీసు పోస్టింగ్‌లు, డీఎస్పీల సీనియార్టీ, ప్రమోషన్లపై చర్చిస్తున్నారు.  ఇక సమావేశం ముగిసన తర్వాత ఇరువురు డీజీపీలు రాజ్ భవన్‌కు వెళ్లారు.


అక్కడ గవర్నర్‌తో భేటీ అయ్యారు. తాము జరిపిన సమావేశ వివరాలను గవర్నర్‌కు వెల్లడించారు. డీఎస్పీల ప్రమోషన్ల విషయంలో గతంలో అవతవకలు జరిగాయని ప్రచారం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: