ఎన్నికల సమయంలో  మరో సర్వే వివరాలు బయటకు వచ్చాయి. దీని పేరు సీబీ సర్వే.. ఈయన విశాఖకు చెందిన ఓ బంగారు వ్యాపారి. రాజకీయాలపై ఆసక్తితో సర్వేలు చేయిస్తుంటారు. ఆయన గతంలోనూ పలుసార్లు సర్వేలు చేయించారు. 


ప్రత్యేకించి 2004 సమయంలో ఈయన చేయించిన సర్వే దాదాపుగా నిజమైంది. ఏదో గాలివాటు సర్వేల మాదిరగా కాకుండా కాస్త పక్కగా చేయించిన సర్వే అని చెబుతున్నారు. కాకపోతే ఈయన రాష్ట్రం మొత్తం సర్వే చేయించలేదు. 

కేవలం 120 స్తానాల్లోనే సర్వే చేయించారు. ఈ సర్వే ప్రకారం.. ఈ 120 స్థానాల్లో తెలుగుదేశం 70 వరకూ సీట్లు గెలుచుకుంటుందన్నది ఈ సర్వే సారాశం. వైసీపీ మాత్రం ఓ 50 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు. మరో 55 సీట్లు సర్వే చేయించలేదు. 

ఒకవేళ అవి టీడీపీ- వైసీపీ చెరో సగం గెలుచుకుంటాయని లెక్కేసుకున్నా.. టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుస్తుందని చెప్పిన కొన్ని సర్వేల్లో ఇది కూడా ఒకటి. ఒక్కో నియోజక వర్గం నుంచి నాలుగువేల శాంపిల్స్ తీసుకున్నామని ఈయన చెబుతున్నారట. చూడాలి ఏది నిజం అవుతుందో.? 



మరింత సమాచారం తెలుసుకోండి: