వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయం అని నమ్ముతున్నవారే ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్నారు. తెలుగుదేశం నేతలు మాత్రం దింపుడు కళ్లెం ఆశలో ఉన్నారు. ఓవైపు ఓటమి గుబులు గుండెల్లో నిండుగా ఉన్నా..  ఏమో గుర్రం ఎగురావచ్చు.. అని ఫలితాల రోజు కోసం భారంగా ఎదురు చూస్తున్నారు. 


వైసీపీ శ్రేణుల్లో మాత్రం అనేక ఊహాగానాలు సాగుతున్నాయి. ఇప్పటికే జగన్ కేబినెట్ కూర్పుపై కూడా అనేక ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో కొంత మందికి హామీ ఇచ్చేశాడు కూడా. ఇప్పుడు మరికొందరికి దారి క్లియర్ అవుతోంది. 

మిగిలిన శాఖలు ఏవైనా.. కీలకమైన ఆర్థిక శాఖ మంత్రి కాస్త సమర్థుడైన నాయకుడికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ శాఖ కోసం వైసీపీలో బాగా వినిపిస్తున్న పేరు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. వైసీపీలో ఉన్న లీడర్లలో పద్దతైన, సౌమ్యమైన నాయకుడిగా బుగ్గనకు పేరు. 

ప్రస్తుతం ఆయన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పీఏసీ ఛైర్మన్ గా ఉన్నారు. బుగ్గన వ్యవహారశైలి కూడా మిగిలిన నేతలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. అధికార పార్టీపై  విమర్శలు చేసే సమయంలో కూడా పరుషమైన వ్యాఖ్యలు చేయకుండా..వ్యంగంగా చెప్పాల్సిన మాటలను సూటిగా చెప్పటంలో ఆయన దిట్ట. పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని జగన్ ఆయనకు కీలకమైన ఆర్ధిక శాఖ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: