తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న బొమ్మల రామారం..హాజీపూర్ గ్రామంలో అమ్మాయిల హత్య విషయంలో పోలీసులు పురోగతి సాధించారు.  ముగ్గురుని ఒకే తరహాలో దారుణంగా అత్యాచారం చేసి వారిని కొన ఊపిరతోనే బావిలో పడవేసి పూడ్చేసినట్లుగా నర హంతకుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి పోలీసుకు తెలిపారు.  2015లో 15 ఏళ్ల కల్పనపై అత్యాచారం చేసి హత్య చేశానని శ్రీనివాసరెడ్డి పోలీసులకు తెలిపాడు.  


పైకి ఏసి మెకానిక్ గా కనిపిస్తున్నా మర్రి శ్రీనివాస్ రెడ్డి చిన్న నాటి నుంచే నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి అని..ఎన్నో సార్లు దొంగ తనాలు..ఇతరులతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం..కొట్టం లాంటివి చేస్తు ఉండేవాడని..ఆ మద్య ఓ హత్య కేసులో కూడా జైలుకి వెళ్లి వచ్చాడని హాజీ పూర్ గ్రామాస్తులు తెలిపారు.  శ్రావణి అనే అమ్మాయి మృత దేహాన్ని బావిలో కనిపెట్టిన గ్రామస్తులు పోలీసుకు తెలిజేయడంతో మర్రి శ్రీనివాస్ అకృత్యాలు ఒక్కొక్కటీ బయట పడ్డాయి.  శ్రావణి హత్య కేసు విషయంలో విచారిస్తున్న సమయంలో ఈ దుర్మార్గుడు గతంలో చేసిన పాపాలు ఒక్కొక్కటీ బయట పెట్టాడు. 


నెలన్నర క్రితం డిగ్రీ చదువుతున్న మనీషాను రేప్ చేసి చంపేశానని చెప్పాడు. ఈ నెల 25వ తేదీన స్కూల్ నుంచి వస్తున్న శ్రావణిపై అత్యాచారం చేశానని, ఆ తర్వాత హత్య చేశానని తెలిపాడు. ముగ్గుర్నీ పాడుపడిన బావిలో పాతిపెట్టానని చెప్పారు. కర్నూలులో కూడా ఒ మహిళపై హత్యాచారం చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.  అంతే కాదు వరంగల్ లో ఓ మహిళను అత్యాచారం చేయాలని చూసినా ఆమె తప్పించుకుందని తెలిపాడు.  నింధితునికి కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలుపుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: