నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇక లేరు. కొంతకాలంగా కిడ్నీ, హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న ఎస్పీవై రెడ్డి హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఏప్రిల్ 3 నుంచి కేర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.
ఎస్పీవై రెడ్డి పూర్తి పేరు ఎస్. పెద్ద యెరికల్ రెడ్డి. ఎస్పీవై రెడ్డి జూన్ 4, 1950లో కడపలో ఆయన జన్మించారు. వరంగల్ నిట్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్లో పట్టాపొందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ప్రస్తుతం ఎస్పీవై రెడ్డి నంద్యాల సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున నంద్యాల నుంచి ఎస్పీవై రెడ్డి పోటీచేశారు. ఎస్పీవై రెడ్డి.. 2014 ఎన్నికల్లో వైసీపీ టికెట్పై గెలిచారు.
గెలిచిన కొద్ది రోజులకే టీడీపీ వైపు మొగ్గుచూపారు. మొన్న ఎన్నికల ముందు చివరి నిమిషంలో జనసేనలో చేరారు. జనసేన టికెట్ మీద నంద్యాల బరిలో దిగారు. 2004 నుంచి ఇప్పటి వరకు నంద్యాల ఎంపీగా పనిచేశారు.