తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచేస్తున్నాయి. మరోవైపు ‘ఫోని’తుఫాన్ భయపెడుతుంది.  ప్రజలు ఓ వైపు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు..మరోవైపు తుఫాన్ గాలులకు ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుందేమో అని భయపడుతున్నారు. 

ఇక కాలేజీ, స్కూళ్లకు వేసవి సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే.  తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈనెల 2వ తేదీ నుంచి నెలాఖరు వరకు సెలవులు ఇచ్చారు. ఈ మేరకు సెలవులకు సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఇక తెలంగాణ హైకోర్టుకు కూడా మే 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. అయితే, అత్యవసర కేసుల విచారణ కోసం ఈ నెల 8, 15, 22, 29 తేదీల్లో హైకోర్టు ప్రత్యేక విభాగం పనిచేయనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: