సికింద్రాబాద్ వారాగూడ చౌరస్తాలో టాటా ఏస్ వాహానం బీభత్సం సృష్టించింది. ఓ మైనర్ బాలుడు వాహనం నడపడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలుడు ఆ వాహనం నడిపేందుకు తీసుకున్నాడు. దీంతో వాహనం అక్కడున్న మనుషులపైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి.
అయితే గత రాత్రి సికింద్రాబాద్ లో ఓ శుభకార్యక్రమం జరుగుతున్న టైమ్లో టాటా ఏస్ వాహనాన్ని డ్రైవర్ ఆ ప్రాంతంలో నిలిపాడు. దీంతో బండిని ఆప్ చేయకుండా ఆన్లోనే ఉంచి పక్కనే ఉన్న పాన్ షాప్లోకి వెళ్లాడు ఈ క్రమంలో అక్కడ ఉన్న ఓ బాలుడు ఆ వాహనాన్ని నడపి చూద్దామని అనుకున్నాడు. వెంటనే ఆ వాహనం ఎక్కి నడిపేందుకు ప్రయత్నించాడు. ఒక్క సారిగా రేజ్ చేయడంతో అక్కడున్న జనాలపైకి దూసుకెళ్లింది.
వేగంగా వెళ్లి బ్యాండ్ వాయిస్తున్న వారిపై దూసుకెళ్లింది. ఈ ఘటనతో అక్కడున్న వారు ఒక్కసారిగా భయందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జ