ఫేస్‌బుక్ ఫ్రెండ్‌షిప్ ఊహించ‌ని మ‌లుపులు తిరిగింది. ఎక్క‌డో బెంగాల్ నుంచి త‌న స్నేహితుడిని వెతుక్కుంటూ న‌గ‌రానికి వ‌చ్చిన ఆమె అనంత‌రం శ‌వ‌మై క‌నిపించింది. వనస్థలిపురంలోని అభ్యుదయ నగర్ లో జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. లాడ్జి సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మృతి చెందిన మహిళను బెంగాల్ కు చెందిన సంగీత(48) గా గుర్తించారు. ఆమె స్నేహితుడిగా న‌గ‌రానికి చెందిన లోకేష్‌ను భావిస్తున్నారు.


మూడేళ్ల క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన లోకేష్ అనే యువకుడి కోసం సంగీత హైదరాబాద్‌ వచ్చినట్లుగా తెలిపారు. మూడు రోజుల నుంచి వారిద్దరూ లాడ్జి రూమ్ లోనే గడిపారని, గత రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని లాడ్జి సిబ్బంది తెలిపారు. ఈ గొడవలోనే సంగీత ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని చెప్పారు.  లోకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనే సంగీతను చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించాడా.? అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: