లండన్లో దారుణం జరిగింది. హైదరాబాద్ వాసి లండన్లో దారుణ హత్యకు గురయ్యాడు. పాతబస్తీలోని నూర్ఖాన్ బజార్కు చెందిన మహ్మద్ నజీముద్దీన్ ఆరేళ్లుగా లండన్లో నివసిస్తున్నాడు. లండన్లోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. అతడి భార్య కూడా అక్కడే డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్నారు.
అయితే ఆదివారం సూపర్మార్కెట్ మూసివేసిన తర్వాత నజీముద్దీన్ ఇంటికి రాలేదు. దీంతో అతడి భార్య సూపర్ మార్కెట్ నిర్వాహకులకు సమాచారం ఇందించారు. దీంతో సూపర్ మార్కెట్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టారు. అలా గాలించగా.. కార్ పార్కింగ్ ప్రాంతంలో తీవ్ర రక్తస్రావంతో నజీముద్దీన్ శవమై కనిపించాడు.
నజీముద్దీన్ హత్యకు గురైనట్లు పోలీసులు నిర్దారించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే నజీముద్దీన్కు అక్కడ ఎవరైనా శత్రువులు ఉన్నారా..? అతడిని ఎందుకు చంపారు..? అందుకు కారణమేంటీ.. అసలు హత్యచేయాల్సిన అవసరమేంటి..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇటు నజీముద్దీన్ హత్యతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అతడి మరణవార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.