టీవీ9 రవిప్రకాశ్‌ కూ కొత్త యాజమాన్యానికి మధ్య జరిగిన వివాదం విషయంలో సాక్షి టీవీ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ కుమ్మేస్తోంది. రవిప్రకాశ్ పై కేసు దగ్గర నుంచి అసలు వివాదం ఎందుకు వచ్చింది.. రవి ప్రకాశ్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారనే తరహాలో వరుస ప్రసారాలు కొనసాగించింది. 

రవిప్రకాశ్ వార్తను అన్ని ఛానళ్లు ఇచ్చినా.. సాక్షి ఇంకాస్త ఎక్కువే ఇచ్చింది. ఇందుకు కారణాలు లేకపోలేదు.. గతంలో వైఎస్ జగన్ పై సీబీఐ కేసు విషయంలో టీవీ అత్యుత్సాహం చూపించిందన్న వాదన ఉంది. జగన్ కేసులను సమాంతరంగా విచారించింది. జగన్ లక్ష కోట్లు తిన్నాడన్న విషయాన్ని బాగా ప్రచారం చేసిన మీడియాలో టీవీ9 ది ప్రధాన పాత్ర. 

అంతే కాదు.. జగన్ లోటస్ పాండ్ భవనం విషయంలోనూ.. టీవీ నైన్ అతి చేసిందన్న విమర్శలు ఉన్నాయి.. జగన్ ఇంట్లో 80 పడక గదులు ఉన్నాయంటూ ఊదరగొట్టారు. ఇలా అవకాశం వచ్చిన ప్రతిసారీ రవిప్రకాశ్ వైసీపీని, జగన్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నించారన్న కోపం సాక్షి మీడియాకు ఉంది.

ఇప్పుడు అదే ఇలా వార్తల రూపంలో బయటపడుతోంది. తాజాగా.. టీవీ నైన్ వార్తలను కవర్ చేసేందుకు వెళ్లిన సాక్షి విలేఖరులను అక్కడి వారు అడ్డుకున్నారు. ఇలా టీవీ నైన్-సాక్షి ఉప్పునిప్పుగా మారడం వెనుక రవిప్రకాశ్ అత్యుత్సాహమే కారణమంటున్నారు సాక్షి మీడియా ప్రతినిధులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: