తూర్పుగోదావరి జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఒకరికి తెలియకుండా ఒకరిని వాడుకున్నాడు ఓ కామాంధుడు. వారిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా దోచుకున్నాడు. తన కామ కోరికలను తీర్చుకున్నాడు దుర్మార్గుడు. అంతేకాదు. వారితో ఏకాంతంగా గడిపి, పోటోలతో బేదించాడు. వేధింపులకు గురిచేశాడు. మైనర్ అయిన చెల్లిపై స్నేహితులతో కలిసి బ్లేడ్తో దాడి చేశాడు రాక్షసుడు.
ఈ మానసిక వేదనను తాళలేక ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు సమస్యను తండ్రికి చెప్పుకున్నారు. దీంతో ఆయన ఫిర్యాదు మేరకు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితురాలి తండ్రి. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.
పిఠాపురానికి చెందిన హేమంత్కుమార్ అనే వ్యక్తి జగ్గయ్యచెరువు కాలనీలో ఉన్న కిరాణా షాపునకు తరుచూ వచ్చే 19 ఏళ్ల యువతితో పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తన లైంగిక కోరికలను తీర్చుకున్నాడు.
ఇక ఆ యువతితో పరిచయం అడ్డం పెట్టుకుని ఆ యువతి చెల్లె అయిన మైనర్ బాలికను అదేవిధంగా నమ్మించాడు రాక్షసుడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. తన కామకోరికలను తీర్చుకున్నాడు. శారీరక సంబంధం పెట్టుకున్నాడు.
హేమంత్ చేసిన మోసపోయామని గ్రహించిన ఆ అక్కచెల్లెళ్లు ఆ దుర్మార్గుడిని నిలదీశారు. దీంతో వారిద్దరి న్యూడ్ ఫోటోలు తన దగ్గర ఉన్నాయని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వాటిని ఇంటర్నెట్లో పెడతానని బెదిరించాడు. ఆ ఫోటోలను తన స్నేహితులతో పంచుకోవడంతో వారు కూడా అక్కాచెల్లెళ్లపై వేధింపులకు పాల్పడ్డారు.
చివరకు బాధితురాళ్లు ఈ విషయాన్ని తండ్రికి చెప్పుకున్నారు. దీంతో ఆయన పిఠాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. హేమంత్ కుమార్తో పాటు అతడి స్నేహితులు జె.అనిరుధ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తో పాటు మరో ఇద్దరిపై కూడా వివిధ సెక్షన్లతో పాటు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు.