ఉదయం లేచిన మొదలు సాయంత్రం పడుకునే వరకు బుల్లితెరపై ఎన్నో హంగులూ ఆర్భాటాలతో మెరుగైన సమాజం..కట్నం తీసుకున్నవాడు గాడిద ఇలాంటి అభ్యుదయ భావాలతో కొటేషన్లు పెడుతూ నానా హంగామా చేసింది టివి9.  ఇప్పుడు ఇదే టీవి9 ఇతర ఛానల్స్ కి హాట్ టాపిక్ గా మారిపోయింది.  మాజీ సీఈవో రవి ప్రకాశ్ లీలలు ఒక్కొక్కటిగా బయట పడుతుండటంతో ఆయనపై కేసులు నమోదు కావడంతో అన్ని ఛానల్స్ లో చర్చనీయాంశం అయ్యింది.  గత కొంత కాలంగా ట్విట్టర్ వేధికగా తన మనసులోని భావాలు వ్యక్త పరుస్తున్నారు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి .

ఈ నేపథ్యంలో  ఇవాళ ట్వీట్టర్ సాక్షిగా మరోసారి రెచ్చిపోయారు. వరుస ట్వీట్లతో రవిప్రకాశ్, చంద్రబాబులపై మండిపడ్డారు. అప్పట్లో నట్వర్‌లాల్‌ అనే చీటర్‌ తాజ్‌మహల్‌నే అమ్మేశాడని తెలిసి విస్తుపోయాం. ఫోర్జరీ, నిధుల స్వాహా, షేర్ల అమ్మకాలు(బోగస్‌), టీవీ9 ట్రేడ్‌మార్క్‌, కాపీరైట్‌ అమ్మకాలు... రోజుకొకటి చొప్పున వెలుగు చూస్తున్న ‘మెరుగైన సమాజం’ ప్రొడ్యూసర్‌ మోసాలు నైజీరియన్‌ మోసగాళ్ళను తలపిస్తున్నాయంటూ వ్యాఖ్యానించారు.  పశ్చిమ బెంగాల్‌లోని ఒక పోలింగ్ బూత్‌లో ఓటర్లకు బదులు ఒక మహిళా అధికారి తానే తృణమూల్ గుర్తు బటన్ నొక్కుతున్న వీడియో వైరల్‌గా మారింది.

ఇది చంద్రబాబుకు కనిపించలేదా? ఎలక్షన్‌ కమిషన్‌ మెతగ్గా వ్యవహరించి ఉంటే తాను కూడా ఏపీలో ఇదే తరహా రిగ్గింగుకు పాల్పడేవాడు కాదా?23 తర్వాత తెలుగుదేశం పార్టీ ముక్క చెక్కలవుతుంది. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని తన స్వార్థ ప్రయోజనాల కోసం భ్రష్టు పట్టించినందుకు చంద్రబాబుపై తిరుగుబాటు జరుగుతుంది. ఇది గమనించే పరువు కాపాడుకునేందుకు మహానాడును రద్దు  చేశాడు. ఇంకా చాలా వింతలు, విడ్డూరాలు చూడబోతున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి: