ఎగ్టిట్ పోల్స్ అన్నీ కూడా ఏపీలో జగన్, కేంద్రంలో మోడీ అంటున్నాయి. మరి అదే నిజం అయితే చంద్రబాబు సంగతేంటి. ఆయన గత  ఏడాదిగా ఏకంగా మోడీ మీదనే తిరుగుబాటు చేసి దేశాలు పట్టారు. అంతటితో వూరుకోకుండా మిగిలిన వారి కన్నా ఎక్కువగా అన్ని రాష్ట్రాలు తిరిగి మరీ మోడీని ఓడించాలని గట్టిగానే చాటింపు వేశారు.


అదే సమయంలో అన్ని పార్టీల నేతలకు ఒకటికి పదిమార్లు కలసి మరీ కూటమి కట్టేందుకు నానా రకాల ప్రయత్నాలు చేశారు. ఇక మోడీ పని అయిపోయింది. వచ్చేది ప్రతిపక్ష కూటమేనని బాబు ఆయన అనుకూల మీడియా ఒక రేంజిలో ప్రచారం చేస్తూ వచ్చాయి. ఏపీకి పీఎం వస్తే నల్ల కుండలతో స్వాగతం. ఆయన మీద నానా విమర్శలు చేయడం. ప్రధాని అన్న గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా వ్యక్తిగత విమర్సలకు దిగడం, మరి ఇవన్నీ మోడీ గుర్తు ఉంచుకుంటే ....


తలచుకుంటేనే కంగారుగా ఉంటుంది. అసలే మోడీ ఏ బాకీ ఉంచుకోరు. ఆయన వైఖరే వేరుగా ఉంటుంది. ఆయనది అంతా డిఫెరెంట్ స్టైల్. మరి మోడీ మళ్ళీ పీఠం ఎక్కితే, ఇక్కడ ఏపీలో అధికారం చేజారితే టీడీపీ, చంద్రబాబు పరిస్థితి ఏంటో వూహించుకోవడానికే భయంగా ఉంటుందనడంలో సందేహం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: