ఎగ్టిట్ పోల్ సర్వేలు వెల్లడి అయ్యాక గాజువాక నుంచి పవన్ గెలుపు పై పందేల జోరు  ఒక్కసారిగా పెరిగిపోయింది. అన్ని సర్వేలు జనసేనకు ఒకటి నుంచి అయిదు సీట్లు ఇవ్వడంతో అందులో కచ్చితంగా గాజువాక ఉంటుందని భావించి పవన్ గెలుపు ఖాయమన్న ధీమాతో జనసైనికులు ఉన్నారు. అదే సమయంలో అక్కడ వైసీపీ గెలుస్తుందని కూడా పందేలు జరుగుతున్నాయి.  రీల్ హీరో పవన్ అని, రియల్  హీరో నాగిరెడ్డి తప్పక గెలుస్తారని ధీమాగా చెబుతున్నారు. 


 ఇక పవన్ మెజారిటీ పైన కూడా పందేలు కాయడం విశేషం. పవన్ గాజువాకలో పోటీ చేస్తానని చెప్పినపుడు లక్ష మెజారిటీ అన్నారు. ఇపుడు పాతిక వేలకు తగ్గకుండా పవన్ గెలుస్తాడని అభిమానులు పందేలకు రెడీ అటున్నారు.  అయితే నాగిరెడ్డి జనంలో ఉన్న వారని, ప్రజలు ఎపుడూ తమకు మేలు చేసిన వారిని, అందుబాటులో ఉన్న వారినే ఎన్నుకుంటారని వైసీపీ నేతలు అంటున్నారు.


నాగిరెడ్డి రియల్ హీరో అని చెబుతున్నారు. ఇప్పటికి  మూడు సార్లు పోటీ చేసి ఓటమి పాలు అయిన నాగిరెడ్డిని ఈసారి జనం తప్పకుండా అదరిస్తారని గట్టిగా చెబుతున్నారు. పైగా జగన్ గాలి కూడా బలంగా వీచిందని అందువల్ల తమ నాయకుడు ఎమ్మెల్యే కావడం ఖాయమని బల్ల గుద్ది చెబుతున్నారు.


అయితే అభిమానులు మాత్రం పవన్ పోటీ చేసినపుడే గెలుపు ఖాయమైపోయిందని అంటున్నారు. పవన్ ఎమ్మెల్యేగా గాజువాక నుంచే అసెంబ్లీకి వెళ్తారని, ఇది రాసిపెట్టుకోవాలని సవాల్ చేస్తున్నారు.   పవన్ గెలుపు కోసం పందేలు జోరుగా సాగుతున్నాయి.   మొత్తానికి పవన్ గెలుపుతో విశాఖలో  గాజు గ్లాస్ పూర్తిగా నిండకపోయినా సగమైనా  నిండుతుందని ఆ పార్టీ అభిమానులు హుషార్ చేస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: