ఎంతటివారైనా ఏదో ఒక సెంటిమెంట్ కు పడాల్సిందే. అసలు సెంటిమెంట్ లేని మనిషి ఉండరు అంటారు. మాకు ఎలాంటి సెంటిమెంట్స్  లేవు. మేము అన్నింటికీ అతీతులమని చెప్పుకుంటారే కానీ వారు సైతం కొన్ని సెంటిమెంట్లకు దాసులే. ఇక దేశాధిపతులు, ప్రముఖులు కూడా సెంటిమెంట్ వెంట పడుతున్నవారే.


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇపుడు సెంటిమెంట్ తోనే తన సొంత నియోజకవర్గం కుప్పంలో గంగమ్మ జాతరకు ఈ రోజు హాజరయ్యారు. భార్య భువనేశ్వరితో కలసి ఆయన గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ఏటేటే జాతర జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చే ఇలవేలుపుగ ఆమెను భావిస్తారు. చంద్రబాబు బెంగుళూరు నుంచి నేరుగా కుప్పం చేరుకుని మరీ పూజలు చేశారు. మరో మారు ఏపీలో అధికారం తనకు ఇవ్వాలంటూ ఆయన గంగమ్మకు ప్రార్ధనలు చేశారని అంటున్నారు.


ఇదిలా ఉండగా బాబు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన దగ్గర నుంచి ఏదో ఒక విషయంపైన గంగవెర్రులెత్తుతూనే ఉన్నారు. ఈసీ మీద, కేంద్రం మీద, మోడీ మీద, ఇటు జగన్, కేసీయార్ మీద, వీవీ ప్యాట్స్ లెక్కింపు మీద ఇలా అన్ని విషయలపైనా ఆయన గంగవెర్రులెత్తుతూ ప్రతిపక్షాలతో కలసి ధర్నాలు పోరాటాలు చేస్తూ వచ్చారు. అటువంటి బాబు ఇపుడు చల్లబడ్డారో లేక చల్లని చూపులు చూడమని గంగమ్మకు మొక్కారో తెలియదు కానీ అమ్మ వారి జాతర‌లో శాంతంగా కనిపించారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: