ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ముందంజలో దూసుకెళ్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైసీపీ ఆధిక్యంలో ఉండగా.. తొలి రౌండ్లో కూడా వైసీపీనే ముందంజలో ఉంది. ఇక బాబు కేబినెట్లో మంత్రులుగా ఉన్న వారిలో ముగ్గురు మంత్రులు ఓటమి బాటలోనే ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న ఇద్దరు మంత్రులు వెనుకంజలో ఉన్నారు. టెక్కలిలో తొలి రౌండ్లో మంత్రి అచ్చెన్నాయుడు వెనుకంజలో ఉన్నారు. టెక్కలిలోనే తొలి రౌండ్కే వైసీపీ 1500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక కళా వెంకట్రావుపై ఎచ్చెర్లలో వైసీపీ అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ లీడ్లో ఉన్నారు. అలాగే నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ వెనుకంజలో ఉన్నారు. ఇక కడప ఎంపీగా పోటీ చేసిన మంత్రి ఆదినారాయణరెడ్డి కూడా వెనుకంజలో ఉన్నారు.