ఏపీలో అధికార టీడీపీ విప్, కాంట్రవర్సీ కింగ్ అయిన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు ఈ ఎన్నికల్లో ఓటరు అదిరిపోయే షాక్ తగిలింది. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు లెక్కలేనన్ని వివాదాలకు కేంద్రబిందువుగా మారిన చింతమనేనిని ఈ ఎన్నికల్లో ఓడించేందుకు వైసీపీ అధినేత జగన్ ప్రీప్లాన్డ్గా దెందులూరులో ముందుకు వెళ్లారు. వైసీపీ యూరప్, యూకే కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరిని రంగంలోకి దించారు. తొలి రౌండ్ ఫలితాల్లో ఇక్కడ చింతమనేనిపై అబ్బయ్య చౌదరి 1300 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.