వైఎస్ జగన్ ఏపీలో ఘన విజయం సాధించారు. ఆయన పార్టీ వైసీపీ అన్ని విధాలుగా దూసుకెళ్ళిపోతోంద్.  లాండ్ స్లైడ్ విక్టరీని సాధించేందుకు ఉరకలు వేస్తోంది. ఈ నేపధ్యంలో విశాఖ శారాదాపీఠం స్వామీజీకి జగన్ నుంచి ఫోన్ వచ్చింది. మీ నిండు ఆశీస్సులతో నేను విజయం  సాధించాను, మీ మేలు మరవలేను అంటూ జగన్ స్వామితో సంభాషించినట్లుగా సమాచారం.


ఇక జగన్ తో స్వామి మాట్లాడుతూ, కులం, మతం, ప్రాంతం, అన్నది చూడకుండా అద్భుతమైన పాలన అందించాలని కోరినట్లుగా భోగట్టా. గత పాలకులు హిందూ ధర్మాన్ని పక్కన పెట్టారని, బూటు కాళ్ళతో ఆలయాలలోకి వెళ్ళారని చెప్పారు. అదే విధంగా పీఠల జోలికి వచ్చి కకావికలం స్రుష్టించాలని చూశారని అన్నారు.


ఇక జగన్ చల్లని పాలన అందించాలని, అందరినీ కలుపుకుని పోవాలని స్వామీజీ కోరారు. రాష్ట్ర ప్రజలకు కొత్త ప్రభుత్వం, జగన్ పాలన మేలు చేకూరుస్తుందని స్వామీజీ దీవించారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి స్వామీజీని రావాలని జగన్ కోరారు. అదే విధంగా  తాను సీఎం అయిన తరువాత పీఠానికి వస్తానని కూడా జగన్ చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: