విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో సూప‌ర్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కౌంటింగ్ ఆరంభం నుంచి ప్ర‌పంచ‌క‌ప్ వ‌న్డే క్రికెట్ మ్యాచ్‌లా చేతులు మారిన ఈ నియోజ‌క‌వ‌ర్గ ఫ‌లితం చివ‌ర‌కు వైసీపీకి అనుకూలంగా వ‌చ్చింది. ముందు నుంచి వైసీపీకి ఆధిక్యం ఉన్నా చివ‌రి మూడు నాలుగు రౌండ్ల‌లో టీడీపీ అభ్య‌ర్థి బొండా ఉమా అనూహ్యంగా పుంజుకోవ‌డంతో ఫ‌లితం చివ‌రి వ‌ర‌కు దోబూచులాడింది. చివ‌ర‌కు బొండా ఉమా కేవ‌లం 15 ఓట్ల‌తో విజ‌యం సాధించారు. ఏపీలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో అతి త‌క్కువ ఓట్ల‌తో ఓ అభ్య‌ర్థి గెలిచిన వ్య‌క్తిగా మ‌ల్లాది రికార్డుల‌కు ఎక్కారు. గ‌త ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరి నుంచి వైసీపీ త‌ర‌పున పోటీ చేసిన ఆర్కే కేవ‌లం 12 ఓట్ల‌తో గెల‌వ‌గా ఇప్పుడు మ‌ల్లాది 15 ఓట్ల‌తో గెలిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: