చిత్తూర్ జిల్లా నగరి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నేత రోజా సెల్వమని మరో సారి విజయఢంకా మోగించింది. తన ప్రత్యర్థి గాలి భాను ప్రకాష్ ను అత్యధిక మెజారిటీతో గెలిచింది. విజయం సాధిస్తాం అన్న టీడీపీ నేతలకు నిరాశే మిగిలింది.

రోజా షో లతో బిజీ గా ఉన్న కూడా , ఆ ప్రాంతం లో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉన్న కూడా అక్కడి ప్రజలు ఆమెకు పట్టం కట్టారు అంటే అది కేవలం జగన్ మేనియా నే అని చెప్పవచ్చు.టీడీపీ నేత భాను ప్రకాష్ కూడా ఈ నియోజకవర్గంలో అంతటి బలమైన నాయకుడు కాకపోవడం తో రోజా విజయం సులువైంది.

టీడీపీ నాయకులు కాస్త శ్రద్ధ పెట్టి మంచి నాయకుడిని బారి లో పెట్టి ఉంటే విజయం వరించేదేమో.ఇక ప్రజలు జగన్ పై ఉన్న నమ్మకం తో వైసీపీ కి ఓట్లు పడ్డాయి. ఇప్పటికే ప్రజలు సంబరాలు మొదలు పెట్టారు. వైసీపీ అన్ని పార్టీ ఆఫీస్ లలో విజయోత్సవాలు షురూ అయ్యాయి. అయితే అధిష్టానం మారింది కాబట్టి నగరి ప్రాంతం రాత కూడా మారుతుందా లేదా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: