వైసీపీ తరుపున పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వర్లు పర్చూరు నుంచి ఓటమి పాలైయ్యారు. 2014 లో అక్కడ ఘనవిజయం సాధించారు. అయితే ఈ బలమైన నేత దగ్గుబాటి దింపడంతో పోటీ హోరా హోరిగా మారింది. నిజానికి దగ్గుబాటి తనయుడు  హితేష్ పోటీ చెయ్యాలి. కానీ హితేష్ కు బదులగా వెంకటేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని వైఎస్ జగన్ ఖరారు చేశారు . ప్రకాశంలో వైసీపీ పూర్తి హవా కనిపించిన దగ్గుబాటు వారు ఓడిపోవటం ఇక్కడ ఆశ్చర్యం. 


పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును ఢీ కొట్టడానికి వెంకటేశ్వరరావే సరైన అభ్యర్థి అని వైఎస్ఆర్ సీపీ శ్రేణులు అభిప్రాయపడ్డారు . ప్రకాశం జిల్లా నుంచి కూడా తెప్పించుకున్న సర్వే నివేదికల్లో కూడా ఈ విషయమే తేలినట్లు స్పష్టమైంది. హితేష్ కంటే కూడా ఆయన తండ్రిని అభ్యర్థిగా నిలబెట్టి, గెలిపించుకోగలిగితే.. అసెంబ్లీలోనూ జగన్ కు సహాయకారిగా ఉంటారనే వైసీపీ అభిప్రాయ పడింది. 


పైగా దగ్గుబాటి గెలిచి ఉంటే ఖచ్చితంగా మంత్రి అయేవాడని అందరూ అనుకున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ మహిళా అధ్యక్షురాలు పురంధేశ్వరి భర్త. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్వయానా తోడల్లుడు. ఆయన గుట్టమట్లు అన్నీ వెంకటేశ్వరరావుకు తెలుసనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఎన్టీ రామారావును పదవీచ్యుతుడిని చేయడానికి చంద్రబాబు చేసిన కుట్రలపై వెంకటేశ్వరరావు ఇదివరకే ఓ పుస్తకాన్ని కూడా ముద్రించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: