లగటిపాటిని ఇప్పుడు తిట్టడానికి చాలా మందికి తిట్లు కూడా సరిపోవేమో .. దొంగ సర్వేలు చేసి బెట్టింగ్ లు పెట్టిన ఎంతోమంది జీవితాలను నాశనం చేశాడు. ఏపీ ఎన్నికల విషయంలో ఎగ్జిట్  పోల్స్ అప్పుడు లగడపాటి ఎంత హడావుడిగా కబుర్లు చెప్పారో అందరికీ తెలిసిందే. నాలుగు పేపర్లు ముందరేసుకుని జ్యోతీష్యుడిలా నంబర్లు  చెప్పారు. తెలుగుదేశం పార్టీ గెలవబోతోందని, మెజారిటీ ఎంపీ సీట్లు కూడా తెలుగుదేశం నెగ్గనుందని, ఏపీ ప్రజలు 'సైకిల్' ఎక్కారని లగడపాటి కబుర్లు  చెప్పారు.


తీరా ఫలితాలు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం లాంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో లగడపాటి రాజగోపాల్ తన 'విలువైన' స్పందనను ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశారు! 'సారీ' అంటూ ఒక మాటతో తేల్చేశారు. జగన్ కు శుభాకాంక్షలు తెలిపి, చంద్రబాబు నాయుడు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలంటూ ఉచిత సలహా పడే శాడు లగడపాటి. ఇక పై తను సర్వేలను వెలువరించడం ఉండదన్నట్టుగా లగడపాటి ప్రకటించుకున్నారు.


లగడపాటికి సర్వే సన్యాసం కూడా తప్పదని ముందు నుంచినే విశ్లేషకులు చెబుతూ వచ్చారు. అయితే తెలుగుదేశం వీరాభిమానులు మాత్రం లగడపాటి రాజగోపాల్ సర్వేను నమ్మారు. నమ్మడమే కాదు.. కొందరు కోట్ల రూపాయల బెట్టింగులు కూడా కాశారు. అంతకు ముందు తెలుగుదేశం పార్టీ నెగ్గుతుందని బెట్టింగులు కాయడానికి వెనుకాడిన వారు కూడా.. లగడపాటి ఎగ్జిట్ పోల్ చెప్పాకా  బెట్టింగులు వేశారు. అలాంటి వారి పరిస్థితి ఏమిటో చెప్పనక్కర్లేదు.  లగడపాటి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వలేదు,. కనిపిస్తే జనాలు ఎక్కడ కొడతారో అని భయపడినట్టుగా ఈయన ప్రెస్ నోట్ విడుదల చేసి చేతులు దులిపేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: