వరంగల్ రూరల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో భార్యతను గొడ్డలితో నరికి అతికిరాతకంగా హతమార్చాడు ఓ శాడిస్టు భర్త. వర్దన్న పేట మండలంలో ఈ ఘటన జరిగింది. కట్ర్యాల గ్రామానికి చెందిన యాదగిరికి రాయపర్తి మండలం కొత్తూరుకు చెందిన మల్లికాంబ తో 23 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇంతకాలం వారి కాపురం సజావుగానే సాగింది. ఇక వారి దాంపత్యంలో కుటుం కలహాలు మొదలయ్యాయి. అనుమానాలు పెంచుకున్నాడు ఆ శాడిస్టు భర్త. ఇదే టైమ్ల వ్యవసాయ భూమి అమ్మే విషయంతో భార్యాభర్తల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇంకేముంది భార్య మాట వినలేదు. ఇంట్లో ఇద్దరు పెళ్లికెదిగిన కుమారులున్నారు. వారి కోసం ఉండనివ్వాలి అన్నా వినకుండా.. భూమిని యాదగిరి అమ్మేశాడు.
భూమి అమ్మడంతో మల్లికాంబ కుమారులతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈనేపథ్యంలో యాదగిరి కోర్డు ద్వారా విడాకులు కోరాడు. దీంతో మల్లికాంబ తాను, తన పిల్లలకు జీవనాధారానికి మెయింటెనెన్స్ కేసు వేసింది. ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది.
అయితే పిల్లలకు పెళ్లి వయసు వచ్చింది. వారికి తల్లిదండ్రులు ఉంటేనే వారికి అమ్మాయిని ఇస్తారని పెద్ద మనుషులు అనడంతో ఆ శాడిస్టు భర్త ఏవేవో మాయమాటలు చెప్పాడు. ఆ భార్యను నమ్మించాడు. మంచిగా ఉంటానని కల్లిబొల్లి మాటలు చెప్పాడు. తామిద్దరం కలిసి ఉంటామని ఒప్పందం చేసుకున్నారు ఈ నెల 16న మల్లికాంబను, కుమారులను తీసుకుని తన ఇంటికి వెళ్లాడు.
ఇంటికొచ్చిన తర్వాత నిద్రిస్తున్న తన భార్య మల్లికాంబపై శుక్రవారం యాదగిరి గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఆ భార్య స్పాట్లోనే చనిపోయింది. ఈ ఘటనపై మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్లు రంగంలోకి దిగాయి.