సిద్ధిపేట నియోజకవర్గం లో నేడు రంజాన్ పర్వదినం పురస్కరించుకొని స్థానిక కొండ మల్లయ్య గార్డెన్ లో ముస్లింలకు కానుకలు పంపిణి చేసిన ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల పేద ముస్లిం లకు సీఎం కేసీఆర్ పంపిణి చేస్తున్నారని, సిద్ధిపేట లో ఈ నెల 31 న ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి పండగా రోజున అందరూ కొత్త బట్టలు ధరించాలన్నదే కేసీఆర్ ఆశయమని పేర్కొన్నారు.


 రాష్ట్రము లో 300 ఇంగ్లీష్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశామని, ప్రతి పేద ముస్లిం మహిళను చదివించాలని సూచించారు. అందరిని చదివించడం వల్లనే వారి జీవితాల్లో వెలుగు వస్తుందన్నారు. 


త్వరలోనే అర్హులందరికీ  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పెంచిన పెన్షన్స్ అందిస్తామని, సిద్దిపేటను క్లీన్ అండ్ గ్రీన్ సిద్దిపేటగా ఉంచడానికి అందరు సహకరించాలని ఈ సందర్భంగా హరీష్ రావు  కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: