ఒడిశా ముఖ్యమంత్రిగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేసారు బిజు జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్ బుధవారం ఒడిశా గవర్నర్ గణేషి లాల్  నవీన్ పట్నాయక్  చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఒడిశాకు 19 ఏళ్లుగా నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉంటూ వస్తున్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆయనకు ప్రజలలో ఎంత  ఆదరణ ఉందనేది స్పష్టం అవుతుంది. మరో ఐదేళ్ల కాలానికి అయన మరోసారి ప్రమాణ స్వీకారం చేసారు.   


ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘‘నాకిది వ్యక్తిగత, వ్యామోహమైన ప్రయాణం కావొచ్చు. 19 ఏళ్లుగా ఇదే హోదాలో ఉన్నాను. ఈరోజు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను. నాలుగున్నర కోట్ల కుటుంబ(ఒడిశా ప్రజలు) నిర్ణయాన్ని అంగీకరిస్తూ, వారి విశ్వాసాన్ని కాపాడుకుంటాను’’ అని ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: