అమరావతి: తెదేపా అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం విజయవాడ ఎంజీ రోడ్డులోని పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తనకు కేంద్ర విదేశాంగ శాఖ జారీ చేసిన ‘డిప్లొమాటిక్‌ పాస్‌పోర్టు’ని అక్కడ అప్పగించారు. తనకు సంబంధించిన సాధారణ పాస్‌పోర్టును తీసుకున్నారు. ఆయన తన వ్యక్తిగత సహాయకులు, భద్రతా సిబ్బందితో కలసి వచ్చారు. దాదాపు 20 నిమిషాలపాటు అక్కడ ఉన్నారు. ఆయన వచ్చిన పని 8-10 నిమిషాల్లోనే పూర్తయింది. మిగతా సమయంలో ఆయనతో అక్కడికి పాస్‌పోర్టు పనుల నిమిత్తం వచ్చిన వారు, కొందరు సిబ్బంది ఫొటోలు దిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: