సవాంగ్ మొదటి నుంచి వివాదరహితుడు.. కాల్‌మనీ కేసులో సమర్థవంతంగా పని చేశారనే మంచి పేరు ఉంది. ఇంకా ఎన్నో మిస్టరీలను సునాయాసంగా చేధించిన ఘనత ఈయన సొంతం. అందువలన ఏ.పి ప్రభుత్వం శ్రీ. గౌతమ్ సవాంగును నూతన డి.జి.పి గా ఎంపిక చేసింది. కొన్ని నిముషాల క్రితమే  ఆంధ్రప్రదేశ్‌ నూతన పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీపీ) గౌతం సవాంగ్‌ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. 

రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో బాధ్యతలు స్వీకరించిన ఐదో అధికారి ఆయన. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి విచ్చేసిన గౌతం సవాంగ్‌ తొలుత పోలీసుల గౌరవ వందనం  స్వీకరించారు. అనంతరం కార్యాలయంలోకి అడుగుపెట్టి బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు సవాంగ్‌ను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తనపై అత్యుత్తమ బాధ్యత ఉంచిందని, దానిని త్రికరణశుద్ధితో నిర్వహిస్తానని చెప్పారు. ఏపీ పోలీసులకు దేశంలోనే మంచి గుర్తింపు ఉందని, అటువంటి శాఖకు డీజీపీగా రావడం చాలా గర్వాంగా ఉందని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: