PHOTO FEATURE 

రంజాన్‌ సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఇచ్చే ఇఫ్తార్‌ విందులో , తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌, కేసీఆర్‌ పాల్గొన్నారు. 
ఇరువురు ముఖ్యమంత్రులు అప్యాయంగా ఒకరినొకరు పలకరించుకొని , విందులో ఉల్లాసంగా పాల్గొనడం చూసిన ప్రముఖులు ఇరు రాష్ట్రాలు సమస్యలు లేకుండా అభివృద్ధి సాధిస్తాయని ఆనందం వ్యక్తం చేశారు. 

గవర్నర్‌తో వీరిద్దరి భేటీ టాక్‌ ఆఫ్‌ది పాలిటిక్స్‌గా మారింది. ఇరు రాష్ట్రాల ఉమ్మడి అంశాలపై వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలిసింది. ఏపీ పునర్విభజన చట్టంలోని కొన్ని అంశాలపై వివాదాలు ఐదేళ్లుగా పెండింగ్‌లోనే ఉన్నాయి.

ఈ సమస్యలన్నింటినీ సానుకూల వాతావరణంలో పరిష్కరించుకోవాలనే ఆలోచనతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరింకుంది. మంత్రులు, పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు.














మరింత సమాచారం తెలుసుకోండి: